Thursday, April 25, 2024

Breaking: ట్ర‌క్కును ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయోధ్య – లక్నోల మధ్య ఈరోజు ఉద‌యం వేగంగా వస్తున్న కారు ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరంతా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement