Tuesday, April 16, 2024

అడ్ర‌స్ అడుగుతూ చైన్ లాగ‌బోయిన దొంగ‌.. చిత‌కొట్టిన ప‌దేళ్ల బాలిక‌

ఓ వృద్ధురాలు త‌న ఇద్ద‌రు మ‌న‌వ‌రాళ్ల‌తో క‌లిసి పార్క్ కి వెళ్లారు. అయితే స్కూటీపై వ‌చ్చిన ఓ యువ‌కుడు ఆ వృద్ధురాలిని అడ్ర‌స్ అడిగాడు. అడ్ర‌స్ చెబుతుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఆ యువకుడు గొలుసును పట్టుకుని లాగుతుండగా లత వదిలించుకునేందుకు పోరాడింది.ఇంతలో లత పదేళ్ల మనవరాలు రుత్వి ఘాగ్ కూడా నానమ్మకు సాయంగా వచ్చింది. ఇద్దరూ కలిసి చైన్ స్నాచర్ పై దాడి చేశారు. దీంతో గొలుసు వదిలేసి చైన్ స్నాచర్ పలాయనం చిత్తగించాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రుత్వి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement