Thursday, March 28, 2024

Big Breaking: పెళ్లికి ఒప్పుకోలేదని కిడ్నాప్​ చేసి చంపేసిన ప్రియుడు.. రంగారెడ్డి జిల్లాలో దారుణం!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి మృతదేహంగా కనిపించింది. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి అంతా ఆ యువతి ప్రియుడు చేసిన ఘాతుకంగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

రాజేంద్రనగర్​లో యువతి మిస్సింగ్​ కేసు విషాదాంతంగా ముగిసింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని పొలాల్లో సాయిప్రియ మృతదేహం ఇవ్వాల లభించింది. ఆమె ప్రియుడు శ్రీశైలమే సాయిప్రియని చంపేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తనతో పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతునికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్​లో అదృశ్యమై సాయిప్రియ మృతదేహంగా కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. అయితే.. సాయిప్రియ హత్య ఘటనలో మరో వ్యక్తి సహకారం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై అన్ని విధాలుగా దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement