Wednesday, April 24, 2024

కూలిన సొరంగం – చిక్కుకున్న కార్మికులు

నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిపోయింది. ప‌లువురు కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ట్ని జిల్లాలో చోటు చేసుకుంది. కట్నీ జిల్లా స్లిమ్నాబాద్‌లో నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా బార్గీ డ్యామ్‌ నుంచి బన్సాగర్‌ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో సొరంగం కూలిపోయింది.ఈ సొరంగంలో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఐదుగురిని రక్షించినట్లు తెలిపారు. మరో నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎస్‌డీఈఆర్ఎఫ్‌ బృందాలు చర్యలు ముమ్మరం చేశాయని కట్ని కలెక్టర్​ ప్రియాంక్ తెలిపారు. రెస్కూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎంత‌మంది కార్మికులు చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement