నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిపోయింది. పలువురు కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ కట్ని జిల్లాలో చోటు చేసుకుంది. కట్నీ జిల్లా స్లిమ్నాబాద్లో నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా బార్గీ డ్యామ్ నుంచి బన్సాగర్ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో సొరంగం కూలిపోయింది.ఈ సొరంగంలో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఐదుగురిని రక్షించినట్లు తెలిపారు. మరో నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎస్డీఈఆర్ఎఫ్ బృందాలు చర్యలు ముమ్మరం చేశాయని కట్ని కలెక్టర్ ప్రియాంక్ తెలిపారు. రెస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement