Friday, April 26, 2024

నిలిచిన 800 లుఫ్తాన్సా విమానాలు.. ప్రయాణీకుల ఇక్కట్లు

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. లుఫ్తాన్సాకు చెందిన పైలట్లు స్ట్రైక్‌కు దిగారు. దీంతో సంస్థ 800 విమానాలను రద్దు చేసింది. జీతాల పెంపును డిమాండ్‌ చేస్తూ పైలెట్ల యూనియన్‌ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. విమానాల రద్దుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫోర్ట్‌, మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోవడంతో ఇది లక్షా 30 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement