Friday, March 29, 2024

Breaking: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమబెంగాల్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. జల్పాయ్ గురి జిల్లా మాన్యగురి వద్ద నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. గాయపడిన 45 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పట్టాలు తప్పిన బోగీలు ఒకదాన్లోకి మరొకటి చొచ్చుకుపోయినట్టుగా ఉన్నాయి. ఈ బోగీల్లో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఈ బోగీలను కట్ చేసి, వాటిలో చిక్కుపోయిన వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రైళ్లో మొత్తం 1053 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement