Friday, March 29, 2024

అల్లర్ల కేసులో 70 మంది గుర్తింపు, 32 మంది అరెస్టు.. మిగతావారిని పట్టుకుంటాం: కమిషనర్ నాగరాజు

నిజామాబాద్ అర్బన్, (ప్రభ న్యూస్​) : నిజామాబాద్​ జిల్లా బోధన్ లో శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరిగిన అల్లర్లలో సంబంధం ఉన్న 70 మందిని గుర్తించినట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న ఉదయం నుంచి జరిగిన అల్లర్లు, ఆందోళనకు సంబంధించి సీసీ కెమెరాల పుటేజీ ద్వారా 70 మందిని గుర్తించినట్లు తెలిపారు. కాగా అందులో గురువారం వరకు 32 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.

పరారీలో ఉన్న మిగితా వారిని త్వరలో పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు. అల్లర్లకు సంబంధించి పలువురిపై నాలుగు సెక్షన్లను నమోదు చేశామని, నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి అల్లర్లను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. బోధన్ లో 144 సెక్షన్ కొనసాగుతోందని కమిషనర్​ నాగరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement