Friday, April 26, 2024

కజిన్​ సిస్టర్​పై ఆ పని, అడ్డుచెపితే చంపేస్తానని బెదిరింపు.. న్యూఢిల్లీలో ఆగని అఘాయిత్యాలు

న్యూఢిల్లీలో బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ వెస్ట్​ డిస్ట్రిక్ట్​లో ఏడేళ్ల ఆఫ్ఘన్​ బాలికపై (కజిన్​) సోదరుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధిరాలి స్టెప్​ బ్రదర్​ అని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసినట్ట డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) సమీర్ శర్మ తెలిపారు. ఆ బాలిక కుటుంబం తిలక్ నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. నాలుగు రోజుల క్రితం బాలిక తల్లి తన కుమార్తెతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్​ చేసింది.

దీనికి తన స్టెప్​ బ్రదర్​(కజిన్​) కారణమని, తనపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా తనకు అడ్డుచెబితే (ప్రతిఘటిస్తే) చంపేస్తానని కూడా బెదిరించాడని సమాచారం. ఇన్సిడెంట్​ తర్వాత రాత్రి తల్లికి బాలిక తన బాధను వివరించింది. బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక.. జులై 15న ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై 31 ఏళ్ల వ్యక్తి తన భార్య సహాయంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన మూడు రోజుల తర్వాత నిందితుడు బాధితురాలి నోటిలో ఏదో కొంత పదార్థాన్ని పోశాడని, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రిలో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడిని షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జై ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో జులై 2న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి సోదరుడు జులై 15న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement