Thursday, April 25, 2024

Flash: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి

మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతిచెందారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే తనయుడు కూడా ఉన్నాడు. మ‌హారాష్ట్రలోని డియోలీ నుంచి వార్ధాకు వెళుతోన్న స‌మ‌యంలో ఎస్‌యూవీ వాహనం సెల్సురా స‌మీపంలో అదుపు త‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది.  సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కారు ప‌డిపోవ‌డంతో కారులోని ఏడుగురు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. వీరంతా వైద్య విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు.

మృతుల్లో భండారు జిల్లాల‌కు చెందిన తిరోడా ఎమ్మెల్లే విజ‌య్ ర‌హంగ్‌డేల్ కుమారుడు అవిష్కార్ రహంగ్‌డేల్ ఉన్నట్టు గుర్తించారు. సోమవారం అర్థ‌రాత్రి 11.30 ప్రాంతంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ఆయన ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement