Friday, March 29, 2024

తెలంగాణలో తగ్గిన మహమ్మారి.. కొత్తగా 645 మందికి వైరస్

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,23,166 నమూనాలు పరీక్షించగా, 645 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 729 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,42,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,29,408 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,237 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,791కి పెరిగింది. ఖమ్మం జిల్లాలో 72, జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 58, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు గుర్తించారు. నారాయణపేట్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.97 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Advertisement

తాజా వార్తలు

Advertisement