Thursday, March 28, 2024

ఇండియాలో కొత్తగా 6093 కరోనా కేసులు నమోదు

మొన్నటి వరకూ తగ్గుతూ వస్తున్న కరోనా మహమ్మారి.. నిన్నటి నుండి పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. దేశంలో కొత్తగా 6093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement