Thursday, April 25, 2024

హుగ్లీ నది లోపల 500 మీటర్ల మెట్రో లైన్-2023జూన్ నాటికి పూర్తి

అండ‌ర్ వాట‌ర్ మెట్రో స‌ర్వీసు కోల్ క‌తాలో అందుబాటులోకి రాబోతోంది. హుగ్లీ నది లోపల నిర్మిస్తున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు 2023 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని కోల్ కతా మెట్రో రైలు కార్పొరేషన్ చెబుతోంది. కోల్ కతా మీదుగా సాల్ట్ లేక్, హౌరా మధ్య ఈ ప్రాజెక్టు నిర్మితం అవుతోంది. హుగ్లీ నది లోపల 500 మీటర్ల పాటు మెట్రో లైన్ ఉంటుంది. మొత్తం 16.55 కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ మార్గంలో 9.30 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేసుకుంది. మిగిలిన 7.25 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి కానున్నాయి. దీంతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది. ఇక నీటిలోపల రైలులో ప్రయాణిస్తూ చూసే అందాలు అద్భుతంగా ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement