Thursday, April 25, 2024

జ‌వాద్ ప్ర‌భావిత రాష్ట్రాల‌కు 46 ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు..

జ‌వాద్ తుపాన్ అల‌జ‌డుల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. తుపాను ప్ర‌భావిత రాష్ట్రాల‌కు అత్య‌వ‌స‌ర స‌హాయం కోసం 46 నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్ ఎఫ్) టీమ్‌ల‌ను పంపిన‌ట్టు ఎన్‌డీఆర్ ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అతుల్ క‌ర్వాల్ తెలిపారు. ఈ బృందాలు ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు అందిస్తాయ‌న్నారు.

ఆయా రాష్ట్రాల్లో ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ టీమ్స్ అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. అంతేకాకుండా మ‌రేదైనా అత్యంత ఎమ‌ర్జెన్సీ అయితే క‌నుక ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఐడీఎఫ్ టీమ్స్ కూడా అప్ర‌మ‌త్తంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మ‌రో 18 బృందాలు స్టాండ్ బైలో కూడా ఉంచినట్ఉటు తెలిపారు అతుల్ క‌ర్వాల్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement