Wednesday, April 17, 2024

ఇండియాలో కొత్తగా 4,417 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్‌ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్‌ నుంచి 6,032 మంది బాధితులు కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,44,66,862కు చేరింది. ఇందులో 4,38,86,496 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 5,28,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 52,336 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ రేటు 1.20శాతం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement