Thursday, April 25, 2024

కరోనా అప్డేట్ః దేశంలో కొత్తగా 42,618 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,00,001 మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజు 36,385 మంది కోలుకున్నారు. దేశంలో క‌రోనాతో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,225కి పెరిగింది. ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,322 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,05,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67,72,11,205 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 58,85,687 డోసులు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement