Wednesday, April 24, 2024

Flash: గన్నవరం వద్ద కారు బీభత్సం.. ఆటోను ఢీకొట్టి పల్టీలు..

కృష్ణా జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి వద్ద ముందు వెళుతున్న పాల ఆటోని ఢీకొని కారు పల్టీ కొట్టింది. అటో కూడా పల్టీలు కొట్టి రోడ్ పక్కనే ఉన్న టిఫిన్ బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో టిఫిన్ బండి వద్ద ఉన్న ముగ్గురు,ఆటో డ్రైవర్ ఒకరు. కారు పల్టీ కొట్టిన సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో అందులోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement