Saturday, April 20, 2024

3rd ODI.. భారత్ భారీ స్కోరు.. 409.. బంగ్లా విజయలక్ష్యం 410 పరుగులు

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 420 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 210 పరుగులు, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ చేయగలిగింది. ఇషాన్ కిషన్ విరోచితమైన బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేశాడు. వరుసగా రెండు వన్డేలు ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పరుగుల వర్షం కురిపించారు. దీంతో భారత్ జట్టు 50 ఓవర్లలో 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 410 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement