Thursday, March 28, 2024

భారత్ లో కొత్తగా 360 కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చింది. దేశంలో తాజాగా 360 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,70,075కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,33,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,046కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,596కు చేరింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement