Friday, April 26, 2024

వ‌ర‌ద బీభ‌త్సం – అస్సాం..మేఘాల‌యాల్లో 31మంది మృతి

గ‌త రెండు రోజుల నుంచి వ‌ర‌ద‌ల వ‌ల్ల అస్సాం..మేఘాల‌యాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ వ‌ర‌ద‌ల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 31మంది మ‌ర‌ణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 ల‌క్ష‌ల మంది ప్ర‌భావానికి గుర‌య్యారు. ల‌క్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అస్సాంలో 12 మృతిచెంద‌గా, మేఘాల‌యాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌లాలో భారీ స్థాయిలో వ‌రద‌లు వ‌చ్చాయి. ఆ న‌గ‌రంలో సుమారు 6 గంట‌ల్లోనే 145 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్ర‌చారంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. మేఘాల‌యాలోని చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వ‌ర్షం ప‌డింది. అగ‌ర్తలాలో 60 ఏళ్ల త‌ర్వాత మూడ‌వ అత్య‌ధిక వ‌ర్షం పాతం న‌మోదైంది. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వ‌ల్ల స్కూళ్ల‌ను మూసివేశారు. వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన బాధిత కుటుంబాల‌కు మేఘాల‌యా సీఎం 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. అస్సాం వ‌ర‌ద‌ల్లో మూడు వేల గ్రామాలు మునిగాయి. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. క‌ల్వ‌ర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఎంతో మంది నిరాశ్రుల‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement