నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ మీదు వెళ్తున్న వారిని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు కమ్మర్పల్లి ప్రాంతానికి చెందిన దంపతులు క్రిష్ణయ్య(36), రజిత(33), కూతురు రాఘవి(12)గా పోలీసులు గుర్తించారు. చిన్న కుమార్తె శరణ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చిన్నారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement