Friday, April 19, 2024

Breaking: సింగరేణిలో విషాదం.. అధికారులతో సహ ముగ్గురి మృతి

సింగరేణి గని ప్రమాదంలో చిక్కుకున్న అధికారులతో పాటు కార్మికుడిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా చివరకు విషాదమే మిగిలింది. ఇద్దరు అధికారులతో పాటు కార్మికుడు మృతి చెందారు. మృతుల  పార్థివదేహలను రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది బొగ్గు శకలాల కింద నుండి బయటకు తీసి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సేఫ్టీ అధికారి జయరాజ్ అండర్ మేనేజర్ చైతన్య తేజ్ తో పాటు తోట శ్రీకాంత్ లు మృతిచెందడంతో సింగరేణి లో విషాదం నెలకొంది. సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement