Tuesday, March 26, 2024

ట్విట్టర్ లో 2,750 ఎంప్లాయిస్.. ఆఫీస్ ని టెక్సాస్ కి తరలించే ఆలోచన లేదన్న మస్క్

అక్టోబర్ 27న ట్విట్టర్ ని స్వాధీనం చేసుకున్నారు ఎలాన్ మస్క్. తన చేతిలోకి ట్విట్టర్ వచ్చిన నాటి నుండి అవసరం లేని, ఫలితాలు చూపించని ఉద్యోగులను తొలగించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు మస్క్. దీంతో మస్క్ రాక ముందు ట్విట్టర్ లో మొత్తం 7,500 మందికి పైనే పనిచేస్తుంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 2,750కు తగ్గిపోయినట్టు సంస్థ అంతర్గత వర్గాల సమాచారం. అంటే 4,750 మందిని ఆయన తీసేసినట్టయింది. కొంత మందిని నేరుగా తీసేయగా.. కొంత మంది వారంతట వాటరే సంస్థ నుంచి వెళ్లిపోయేలా చేయడంలో మస్క్ సక్సెస్ అయ్యారు.

ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు పూర్తయిందంటూ.. కొత్తగా ఇంజనీర్లు, సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటున్నామని, రిఫరల్స్ ఉంటే చెప్పాలని మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కోరినట్టు సమాచారం. సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్ లో కోడ్స్ ను గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టెక్సాస్ కు తరలించే ఆలోచనేదీ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement