Tuesday, April 23, 2024

ఏపీలో థర్డ్ వేవ్ ప్రభావం.. 24వేల మంది చిన్నారులకు కరోనా

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా వీడలేదు కానీ అప్పుడే థర్డ్ వేవ్ వణికిస్తోంది. మొదటి, రెండో దశల్లో వృద్ధులు, మధ్య వయస్కులపై ప్రభావం చూపిన కరోనా.. మూడో దశలో చిన్నారుల‌కు ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌ని ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో 8వేల చిన్నారులకు కరోనా సోకినట్లు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ థర్డ్‌వేవ్ ప్రభావం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదేళ్ల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.

అయితే థర్డ్‌వేవ్‌పై ముందుగానే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది ఒక శాతం మంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (MIS-C) అటాక్ కావచ్చని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement