Thursday, April 25, 2024

వ‌చ్చే 20ఏళ్ల‌లో కేటీఆర్ ప్ర‌ధాని అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు – ఆశా జ‌డేజా మోత్వాని

వ‌చ్చే 20ఏళ్ల‌లో మంత్రి కేటీఆర్ భార‌త‌దేశ ప్ర‌ధాని అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని ట్వీట్ చేశారు అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని . అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement