Friday, April 19, 2024

Flash: బాసరలో విషాదం.. గోదావరిలో ఇద్దరు విద్యార్థులు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద విషాదం నెలకొంది. బాసర అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు.. గోదావరిలో స్నానం ఆచరించే సమయంలో ఈత రాక మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు మహారాష్ట్ర ఎల్.ఐ.టి కాలేజీ అకోలాకు చెందిన కిరణ్(22) ప్రతీక్(22)గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని స్థానిక సందర్శించిన బాసర పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement