Thursday, March 28, 2024

Drunk & Drive: ప్రాణం తీసిన మద్యం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపి మెకానిక్ షాప్ గోడను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు  రామ్ నగర్ కు చెందిన శివరాం, మహేష్, సిద్దులు ఒకే ద్విచక్రవాహనంపై జవహార్ లాల్ నగర్ వైపు వెళ్తూ.. మెకానిక్ షాపు గోడను అతివేగంగా కొట్టారు. దీంతో శివరాం అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మహేష్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మరో యువకుడు సిద్దు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement