Saturday, March 23, 2024

పెరిగిన మద్యం ధరలు.. శానిటైజర్ తాగుతున్న కూలీలు

కరోనా నుంచి రక్షణ పొందేందుకు వాడుతున్న శానిటైజర్లు ప్రాణాలు హరిస్తున్నాయి. ఏపీలో శానిటైజర్ తాగి గడిచిన నెల రోజులుగా 8 మందికి పైగా మృత్యువాత పడ్డినట్లు తెలుస్తోంది. తాజాగా విజయవాడ నగరంలో శానిటైజర్ తాగి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌లకు అలవాడు పట్టడారు. శానిటైజర్లను కూల్ డ్రింక్‌లో కలుపుకుని సేవిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందారు. కాగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement