Thursday, March 28, 2024

ఆక్సిజన్ కొరతతో మరో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్‌ అందుబాటులో లేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిన్న విజయనగరంలో జిల్లాలో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందగా.. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందారు. ఆస్పత్రిలో తెల్లవారుజామున ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగా బాధితులు చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమం ఉంది.

కాగా, విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement