Thursday, April 25, 2024

మెదక్ లో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

మెదక్జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తల్లికూతురు మృతి చెందారు. హవేలీ ఘన్‌పూర్ మూలమలుపు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతురు అక్క‌డికక్క‌డే మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వెనక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి అజ్మీర్ దర్గాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు హైదరాబాద్ లోని ఫలక్‌నుమాకు చెందిన బీబీ(45), జహీర్(15)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement