Thursday, March 28, 2024

1st Test : రెండవ రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోరు 321/7

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 114 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. ఇంకా మూడు వికెట్లు మిగిలి ఉన్నాయి. భారత్ జట్టు బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ 120 పరుగులు చేసి ఔట్ కాగా, రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement