Thursday, April 18, 2024

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 203 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి చేరింది. ఇందులో 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 4,49,538 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రలో 9,735 కేసులు రిక్టారు అయ్యయి.
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 72,51,419 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు 91,54,65,826 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement