Thursday, March 28, 2024

కొత్త‌గా 185క‌రోనా కేసులు.. నేడు ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

దేశంలో కొత్త‌గా 185క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో 4,41,42,432 మంది కోలుకున్నారు. మరో 3402 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 5,30,681 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మహమ్మారికి ఒకరు బలయ్యారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 2,20,02,12,178 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. బుధవారం ఒక్కరోజే 1,17,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పరిస్థితుల, ఇతర అంశాలపై ప్రధాని మోదీ నేడు సమీక్షించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement