Sunday, March 24, 2024

భారత్ లో కొత్తగా 175 కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశంలో పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2,01,690 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 175 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,570 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా 5,30,707 మంది మృతి చెందారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement