Thursday, April 25, 2024

భారత్ లో కొత్తగా 170కరోనా కేసులు.. ఒకరు మృతి

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖంగా కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా.. 170 కేసులు కరోనా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,371కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,721కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement