Thursday, April 18, 2024

16 ఏళ్ల అమ్మాయిపై అఘాయిత్యం.. లగ్జరీ బస్సులోకి లాక్కెళ్లి లైంగిక దాడి..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడోదరలోని ఓ హై సొసైటీ ఏరియాలో ఆపి ఉన్న లగ్జరీ బస్సులోకి ఆ అమ్మాయిని ఈడ్చుకెళ్లారు. జనవరి 2వ తేదీని జరిగిన ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా తెలిశాయని పోలీసులు చెప్పారు.

వడోదర సిటీలోని న్యూ వైపీ రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని అడ్డగించి రోడ్డు పక్కన ఆగి ఉన్న లగ్జరీ బస్సులోకి బలవంతంగా లాక్కెళ్లారు. కాగా, ఓ వ్యక్తి ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడుతుంటే.. మరో ఇద్దరు ఎవరూ రాకుండా కాపలాగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఇప్పటికే చాలామంది బాలికలపై అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ‘‘జనవరి 2వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో గిరిజన వర్గానికి చెందిన 16 ఏళ్ల బాధితురాలిని ప్రధాన నిందితుడు మైనర్, అతని ఇద్దరు సహచరులు ఆపి ఉంచిన బస్సులోకి లాక్కెళ్లారు’’ అని హర్ని పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. మైనర్‌పై అత్యాచారం చేసిన తర్వాత ప్రధాన నిందితుడు ఆమెను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని, చంపేస్తానని బెదిరించాడన్నారు. కొంతకాలం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆ బాలిక మధ్యప్రదేశ్‌లోని తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. అయితే, బాలిక మామ ఆమెకు జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుని పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. 376 (రేప్), 354 (A) (లైంగిక వేధింపులు), 506 (2) (నేరపూరిత బెదిరింపు), 114 (నేరం జరిగినప్పుడు ప్రేరేపకుడు). POCSO చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement