Tuesday, April 23, 2024

Breaking: దేశవ్యాప్తంగా 155 రైళ్లు రద్దు..

దేశవ్యాప్తంగా వివిధ కారణాల నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. మరో 55 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. 26 రైళ్ల స్టేషన్లను మార్చామని, 17 రైళ్లను రీషెడ్యూల్ చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement