Wednesday, March 27, 2024

పిడుగుపాటుకి 14మంది మృతి-బాధిత కుటుంబాల‌కి రూ.4ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం

ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు పిడుగులు కూడా భారీగా ప‌డుతున్నాయి. దాంతో పిడుగుపాటుకి 14మంది మృతి చెంద‌గా ..16మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అత్యధికంగా బాందా జిల్లాలో పిడుగులు ప‌డి నలుగురు మరణించారని చెప్పారు.ఈ మ‌ర‌ణాల ప‌ట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement