Friday, April 19, 2024

దేశంలో కొత్త‌గా 1249 క‌రోనా కేసులు

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,249 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,00,667 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,927 కేసులు యాక్టివ్‌ (Active Cases)గా ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందడంతో.. మరణాల సంఖ్య 5,30,818గా నమోదైంది. ఇక కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,61,922 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement