Friday, April 19, 2024

Breaking: ఐఐటీ హైదరాబాద్ లో కరోనా.. 119 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో కరోనా కలకలం రేపింది. విద్యార్థులు, స్టాఫ్ తో సహా 119 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీ క్యాంపస్ లోనే హోమ్ ఐసోలేషన్ లో విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.

విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మినహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని యాజమాన్యం వెల్లడించింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్‌ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఆన్​లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement