Thursday, April 25, 2024

కొత్తగా 1,132కరోనా కేసులు.. 14మంది మృతి

నేడు కొత్తగా దేశంలో 1,132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,30,500 మంది మహమ్మారికి బలయ్యారు. రోజువారీ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటంతో యాక్టివ్‌ కేసులు 14,838కు పడిపోయాయి. కాగా, 24 గంటల్లో 14 మంది మృతిచెందారు.ఇక మొత్తం కేసుల్లో 0.03 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.72 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement