Friday, April 19, 2024

కడప జిల్లాలో పేలుడు.. 10మంది మృతి

కడప జిల్లా కలసపాడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మామిళ్లపల్లి శివారు ముగ్గురాళ్ల గనిలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాళ్లు వెలికితీసే క్రమంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. వారి మృత‌దేహాలు తునాతున‌క‌లయ్యాయి. పేలుళ్ల ధాటికి పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 7 మంది మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement