Saturday, April 20, 2024

రహదారి రక్తసిక్తం: ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం

గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వ‌ద్ద ఈ తెల్లవారుజామున ట్రక్, కారు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన ప‌ది మంది మృతిచెందారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తారాపూర్ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వ‌స్తున్న ట్ర‌క్కును కారు ఢీకొన‌డంతో దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ప‌ది మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.  ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement