Saturday, April 20, 2024

వీడియో: దంపతుల ప్రాణం తీసిన సెల్‌టవర్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి ప్రకోపానికి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో వీచిన ఈదురుగాలులకు స్థానిక తాలూకా కార్యాలయం ఎదురుగా సెల్ టవర్ కుప్పకూలింది. అయితే రోడ్డుపై బైకుపై వెళ్తున్న భార్యాభర్తలపై సెల్‌టవర్ ఒక్కసారిగా కూలడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మరణించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement