Friday, April 19, 2024

‘మా’ ఎన్నికల వివాదం: ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే..

‘మా’ ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతోంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించినా.. ఎన్నికల వ్యవహారంపై ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఎన్నికల వివాదంపై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా కొన్ని ఫోటోలను, అలాగే ఎన్నికల అధికారికి వారు రాసిన లేఖను ట్వీట్ చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని ప్రకాష్ రాజ్ గతంలో ఆరోపించారు. తాజాగా ఇందుకు సబంధించిన ఫోటోలను ట్వీట్టర్ లో షేర్ చేశారు.

‘’మా ఎలక్షన్స్ 2021… ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే… సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి… ఎన్నికలలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేలా చేస్తాము. ఎలక్షన్స్ ఎలా జరిగాయి? జస్ట్ ఆస్కింగ్ ” అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో ప్రకాష్ రాజ్ రౌడీ షీటర్ అని ఆరోపిస్తున్న సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు పక్కనే ఉండడం కనిపిస్తోంది. అతను మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement