Wednesday, April 24, 2024

భూక‌బ్జా కేసులో టీజీ వెంక‌టేశ్ కి భారీ ఊర‌ట – ఎఫ్ ఐఆర్ నుంచి పేరుని తొల‌గించిన పోలీసులు

జూబ్లీహిల్స్ ప‌రిధిలోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెల‌రీస్ కు కేటాయించిన స్థ‌లాన్ని ఆక్ర‌మించేందుకు క‌ర్నూలు జిల్లాకు చెందిన కొంద‌రు వ్య‌క్తులు య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. మందీ మార్బ‌లంతో వ‌చ్చిన స‌ద‌రు ముఠా… ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెల‌ర్స్‌కు చెందిన సెక్యూరిటీ గార్డుల‌పై దాడికూడా చేసింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ముఠా సభ్యుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను తీసుకుని వ‌చ్చిన వ్యక్తి టీజీ వెంక‌టేశ్ స‌మీప బంధువు టీజీ విశ్వ ప్ర‌సాద్ అని పోలీసులు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారంపై వివ‌రాలు సేక‌రించిన పోలీసులు… అరెస్టైన నిందితులు చెప్పిన వివ‌రాల మేర‌కు టీజీ వెంక‌టేశ్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు.. ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీజీ వెంక‌టేశ్ ఈ ఘ‌ట‌న‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అయినా కూడా పోలీసులు ఆయ‌న పేరును కేసు నుంచి తొల‌గించ‌లేదు. తాజాగా ఈ కేసులో మ‌రింత మేర క్లారిటీ తెచ్చుకున్న పోలీసులు టీజీ వెంక‌టేశ్ పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొల‌గించారు.దాంతో టీజీ వెంక‌టేశ్‌కు భారీ ఊర‌ట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement