Saturday, April 20, 2024

”బీసీ గోస- బీజేపీ భరోసా”…క‌మ‌ల‌నాధుల కొత్త నినాదం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అధికారం లోకి రావాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందు కు తగిన విధంగా కార్యా చరణను ము మ్మరం చేస్తోంది. ఇప్పటికే నిరుద్యోగులు, మహి ళలు, రైతులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉద్యమి స్తున్న కాషాయ పార్టీ తాజాగా బీసీ, ఓబీసీలపై గురి పెట్టింది. రాష్ట్రంలోని 55లక్షల బీసీ కుటుం బాలకు బీజేపీని చేరువ చేయడంపై పక్కా ప్రణా ళికను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ”ప్రజా గోస- బీజేపీ భరోసా” పేరుతో ప్రజా సమస్యలపై పాద యాత్రలు, ”మహిళా గోస- బీజేపీ భరోసా” పేరుతో మహిళల సమ స్యలపై, ”నిరుద్యోగ గోస – బీజేపీ భరోసా” పేరుతో నిరు ద్యోగుల సమ స్యలపై ఉద్యమించిన పార్టీ ఇప్పుడు ”బీసీ గోస- బీజేపీ భరోసా” పేరు తో మరో కొత్త కార్యక్ర మానికి రూపకల్పన చేసింది.

ఈ కార్యక్రమం కింద ”పల్లె పల్లెకు ఓబీసీ… ఇంటింటికీ బీజేపీ” నినాదంతో బీసీల సమ స్యల పరి ష్కా రంపై బీజేపీ ఉద్య మించనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా కరప త్రాన్ని రూపొం దించారు. అందులో కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను పేర్కొంటూ బీసీలను రాష్ట్రంలోని అధి కార బీఆర్‌ఎస్‌ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో వివరిస్తూ పలు అంశాలను చేర్చారు. రాజకీ యంగా, ఆర్థికపరంగా, విద్యా పరంగా, సామాజిక న్యాయం విషయంలో, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలు బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గుర య్యారని కరప త్రంలో పలు అంశాలు చేర్చారు. పల్లె పల్లెకు ఓబీసీ, ఇంటింటికీ బీజేపీ కార్యక్ర మాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రారంభిస్తారని నేతలు చెప్పారు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఆయన స్వ యంగా ఈ కార్య క్రమంలో పాల్గొని బీసీల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయ డంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నా రు. దేశానికి ఓ బీసీ నాయకుడిని ప్రధానిగా బీజేపీ అందించిందని, అయితే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన అవకాశాలు లభిం చడం లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement