Wednesday, April 17, 2024

ప్రేక్ష‌కుల స‌మక్షంలో మేజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్వీట్ చేసిన హీరో

యంగ్ హీరో అడవి శేషు న‌టిస్తోన్న చిత్రం మేజ‌ర్. ఈ మూవీని శ‌శికిర‌ణ్ తిక్క రూపొందిస్తున్నాడు. కాగా
ఈ చిత్రంలో సాయీ మంజ్రేఖర్ , శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినీ చరిత్రలోనే తొలిసారిగా రిలీజ్ డేట్ కు ముందే ఆడియెన్స్ కోసం దేశ వ్యాప్తంగా పలు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రీ ప్రీమియర్ షోను వేస్తున్నారు. మే 24 నుంచి స్టార్ట్ అయిన ఈ స్పెషల్ స్క్రీనింగ్ నేటితో ముగియనుంది. చివరి షోను మేకర్స్ వైజాగ్ లోని సంగం శ‌రత్ థియేటర్ లో వేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో షో అనంతరం అక్కడే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించనున్నట్టు కన్ఫమ్ చేశారు. ఈ స్పెషల్ షోకు ఇంకా టికెట్స్ అవలెబుల్ లోనే ఉన్నాయని, అభిమానులు త్వరగా బుక్ చేసుకోవాలని హీరో అడివి శేష్ సూచించారు. మేజ‌ర్ చిత్ర ప్ర‌మోష‌న్లు కొత్తగా చేస్తోంది చిత్ర టీం.

Advertisement

తాజా వార్తలు

Advertisement