Friday, April 19, 2024

పెట్రో మంట: బైక్ ను ట్యాంక్ బండ్ లో పడేసిన యూత్ కాంగ్రెస్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును యూత్ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. పెట్రోల్ ధరల భరించలేక .. ఏకంగా బైక్ నే ట్యాంక్ బండ్ లో పడేసారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చి ట్యాంక్ బండ్​లో తాము ప్రయాణించిన బైక్​ను విసిరేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కేంద్రం భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement