Thursday, April 25, 2024

దేశంలో కరోనా మరణ మృదంగం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. మరణాలు కూడా కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,34,692 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,341 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,75,649 చేరింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,23,354 వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే మృత్యువాతపడుతున్నారు.  కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటి రవకు మొత్తం 11,99,37,641 మందికి టీకాలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement