తెలంగాణలో జ్వర సర్వే జరుగుతోంది. రెండు రోజుల్లో 29లక్షల ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. కాగా 1.28లక్షల మందిలో కరోనా లక్షణాలు ఉండటంతో అక్కడిక్కడే కిట్లను అందజేశారు. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో 29 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. సర్వేలో మొత్తం 1.28 లక్షల మందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించి, వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను అందించారు. తమకు లక్షణాలున్నా కానీ, భయంతో బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు. ఈ రకంగా చూస్తే ప్రతి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఎక్కువ మంది ప్రైవేటు క్లినిక్ లను ఆశ్రయిస్తుండడంతో అవన్నీ లెక్కల్లోకి రావడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..